15 April, 2026 | 1:16 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మహిళను అత్యాచారం చేసిన నిందితునీ అరెస్ట్, రిమాండ్

31-10-2025 11:25 PM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): ఓ మహిళను అత్యాచారం చేసిన కేసులో నిందితుడును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళ పై అత్యాచారం కేసు వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిదీ పేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఈనెల 26న వ్యవసాయ పనులకు నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెను వెంబడించి పట్టుకొని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి నోరు మూయించి అరుపులు కేకలు వేయకుండా అడ్డుకొని ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసి పరారైనట్లు బాధితురాలు మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని మాచారెడ్డి పోలీసుల విచారణలో నిందితుడు మహిళపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. సమీపంలోని మణికంఠ రైస్ మిల్ లో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్ గా గుర్తించినట్లు తెలిపారు.

అతడు పరారీలో ఉండడంతో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, ఎల్లారెడ్డి సిఐ, మాచారెడ్డి, దేవునిపల్లి, గాంధారి, బిబిపేట ఎస్ఐలు, ఏడు బృందాలుగా ఏర్పాటు చేసి వెతికెందుకు పంపించినట్లు ఎస్పి తెలిపారు. నిందితుడు బీహార్, వెళ్లిపోవచ్చు అని భావిస్తూ ముందస్తుగా, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల కు ముందుగా పంపి ప్రత్యేక బృందాలతో వెతికినట్లు తెలిపారు. నిందితుడు నీ ఈ నెల 30న మహారాష్ట్రలోని గొండియా జిల్లాలో నిందితుడుని చాకచక్యంగా పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసరావు, సీఐలు, రామన్, ఎస్సైలు పాల్గొన్నారు.