శ్రీ సరస్వతీ శిశు మందిరంలో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలు
01-11-2025 12:37 AM
కొత్తపల్లి,(విజయక్రాంతి): స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల లో ఉక్కుమనిషి సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో వనవాసి కళ్యాణ్ పరిషత్ తెలంగాణ ప్రాంత శ్రద్ధా జాగరణ ప్రముఖ్ పరుశరామ్ పాల్గొన్నారు. ఆయన విద్యార్థులను ఆచార్యులను ఉద్దేశించి మాట్లాడుతూ పటేల్ సాహసోపేత నిర్ణయాలు మనం ఈనాడు స్వేచ్ఛగా ఉండడానికి కారణమని, వారు చేపట్టిన ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 13 న ప్రారంభమై సెప్టెంబర్ 17న ముగిసినందున మన తెలంగాణ కు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు.






