15 April, 2026 | 12:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

61 ఏళ్ల వ్యక్తికి అకలేషియా కార్డియా

06-12-2025 12:00 AM

ప్రత్యేక ప్రక్రియతో కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రా బాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అరుదైన అకలేషియా కార్డియా వ్యాధితో బాధపడుతున్న 61 ఏళ్ల మహిళకు ఆధునిక పర్ ఓరల్ ఎండోస్కిపిక్ మియోటొమీ (పొఎం) చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఆ హారం మింగడంలో తీవ్రమైన ఇబ్బంది, దగ్గు, వాంతులు, ఛాతి మండింపు వంటి లక్షణాలు పెరుగుతూ, చివరికి ద్రవాలు కూడా మింగలేని స్థితి రావడంతో రోగి మెడికవర్ వైద్యులను సంప్రదించారు.

పరీక్షించిన వై ద్యులు అకలేషియా కార్డియాగా నిర్ధారించా రు. ఈ వ్యాధిలో లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ సడలకపోవడం వల్ల ఆహారం అన్నవాహికలో చేరి నిలిచిపోవడం, బరువు తగ్గ డం మరియు ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం పెరుగుతాయి. ఈ సవాలుతో కూడిన కేసులో, మెడికవర్ గ్యాస్ట్రో ఎంటరాలజీ బృందం ఎలాంటి బయట కోతలు లే కుండా పూర్తిగా ఎండోస్కోపిక్ విధానంలో పోఎం ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది.

చికిత్స అనంతరం రోగి మరు సటి రోజే ద్రవాలు తీసుకునే స్థితికి చేరుకుని స్పష్టమైన ఉపశమనం పొందారు. ఈ సందర్భంగా మెడికవర్ హా స్పిటల్స్, సికింద్రాబాద్ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. కృష్ణ గోపాల్ మాట్లాడు తూ, పొఎం వంటి ఆధునిక ఎండోస్కోపిక్ పద్ధతులు అన్నవాహిక వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నాయి అన్నారు.