23 March, 2026 | 2:57 PM

Breaking News

పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •   అసెంబ్లీ ముట్టడి అడ్డుకట్ట – బీజేపీ నాయకుల అరెస్టుపై ఆగ్రహం   •  

ఫర్టిలైజర్ షాప్ యజమానులపై చర్యలు తీసుకోవాలి

28-07-2025 11:07 PM

మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు నియోజకవర్గంలో రైతులను నిలువు దోపిడి చేస్తున్న ఫర్టిలైజర్ షాప్, డిసిఎంఎస్ షాప్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జన సమితి నాయకుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జుమ్మిడి గోపాల్ లు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గంలోని ఫర్టిలైజర్ షాప్, డిసిఎంఎస్ షాప్ యాజమానులు యూరియా, డిఏపి, ఎరువులను అధిక ధరలకు అమ్ముతూ, పేద రైతులను నిలువు దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. రైతులను దోచుకుంటున్న ఫర్టిలైజర్ షాప్, డిసిఎంఎస్ షాప్ యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే నియోజకవర్గం వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ గణపతి పాల్గొన్నారు.