calender_icon.png 23 September, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్​ వార్తలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి

22-09-2025 11:03:45 PM

– రాష్ట్ర యూత్ కాంగ్రెస్​ ​అధ్యక్షుడు జక్కిడి శివచరణ్​రెడ్డి

– ఎల్బీనగర్ ​డీసీపీ ప్రవీణ్​కుమార్​కు ఫిర్యాదు

ఎల్బీనగర్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్​అధ్యక్షుడు జక్కిడి శివచరణ్​రెడ్డిపై స్థానిక బీఆర్ఎస్​ సోషల్ ​మీడియా ఉద్ధేశపూర్వకంగా తప్పుడు వార్తలను సృష్టిస్తూ గోబెల్స్​ ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్​అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ఎల్బీనగర్​ డీసీపీ ప్రవీణ్​ కుమార్​ను కోరారు. సోమవారం ఎల్బీనగర్​లోని డీసీపీ ఆఫీస్​లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మేడ్చల్​మల్కాజ్​గిరి జిల్లా కీసర ఓ భూ సమస్యకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి  పై తప్పుడు వార్తలు సృష్టిస్తూ... సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. బీఆర్ఎస్​ పార్టీ తప్పుడు ప్రచారాన్ని  ఖండిస్తున్నానన్నారు.  కాంగ్రెస్​ ప్రజా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని చూసి ఓర్వలేని బీఆర్ఎస్​ సోషల్ ​మీడియా మాపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.  కీసరలో భూ సమస్యకు తమకు ఎలాంటి  సంబంధం లేదని  స్పష్టం చేశారు. ఫేక్​వార్తలు వ్యాప్తి చేస్తూ..తమ పరువుకు భంగం కలిగిస్తున్నవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు.  వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరినట్లు చెప్పారు.