27-09-2025 07:50:06 PM
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్
వనపర్తి టౌన్: ప్రజలు ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అన్నారు. శనివారం సాయంత్రం ఐడీఓసీ ప్రాంగణంలో జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు అదనపు కలెక్టర్ రెవెన్యూ సందర్శించారు. తీరొక్క పువ్వులతో ముస్తాబు చేసిన బతుకమ్మ ప్రతిమకు పూజలు చేసారు.