17 June, 2026 | 11:08 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

ఓటుకు.. వయస్సు అడ్డు కాదు

15-12-2025 12:00 AM

ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 14(విజయ క్రాంతి): నేటి తరంలో ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత సైతం ఆసక్తి చూపడం లేదు అలాంటిది 105 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకొని నేటి తరానికి ఆదర్శంగా నిలిచింది. దహేగాం మండలంలోని గొర్రెగుట్ట గ్రామానికి చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు రసూల్ ఇట్యాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించి ఆదర్శంగా నిలిచారు. వయసు పైబడినప్పటికీ ఆమె ఆసక్తిగా వచ్చి ఓటు వేయడం స్థానికులకు స్ఫూర్తినిచ్చింది. అధికారులు ఆమెకు సహాయం అందించారు. ఆమె ఓటు నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయం.