14 July, 2026 | 11:41 PM

బీబీనగర్‌ ఎయిమ్స్‌ మెడికో అనుమానాస్పద మృతి

15-05-2025 02:29 PM

హైదరాబాద్: బీబీబ్‌నగర్‌లోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ విద్యార్థి(AIIMS MBBS student) పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం పోలీసులు తెలిపారు. కేరళకు చెందిన 24 ఏళ్ల విద్యార్థి హాస్టల్ నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కానీ చాలా సేపటి తర్వాత కూడా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన అతని స్నేహితులు అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థి తండ్రి హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీబీనగర్‌లోని పెద్ద చెరువు సమీపంలో ఉన్నట్లు గుర్తించాడు.

ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సరస్సు సమీపంలో విద్యార్థి ద్విచక్ర వాహనం, పాదరక్షలు, ఫోన్‌ను కనుగొన్నారు. సరస్సు నుండి మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు నిపుణులైన ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఎయిమ్స్‌ మెడికో అనుమానస్పద మృతి కారణాలు తెలియాల్సిఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతుడు అభిజిత్‌జోయ్‌ ఎంబీబీఎస్‌ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. అభిజిత్‌జోయ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు.