15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

టేకులపల్లిలో ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం

01-11-2025 12:00 AM

టేకులపల్లి, అక్టోబర్ 31, (విజయక్రాంతి):టేకులపల్లి మండల కేంద్రంలో ఏఐటీయూసీ 106 సంవత్సరాల ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పార్టీ జెండాను సిపిఐ జిల్లా నాయకులు గుగులోత్ రామ్ చందర్ ఎగరవేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చందర్ మా ట్లాడుతూ.. 106 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన సంఘం ఏఐటియుసి ఆనాడు వేట్టి చాకిరికి దోపిడీకి వ్యతిరేకంగా దేశ స్వతంత్రం కోసం ఆనాడు ఐక్యంగా బొంబాయి నగరంలో 1920 అక్టోబర్ 31న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీగా లాజపతిరాయ్, ఎంఎన్ జోషి నాయకత్వంలో మొదటి మహాసభ జరిగిందన్నారు.

ఆనాటినుండి నేటి వరకు ఏఐటీ యూసీ నాయకత్వంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించుకొని కార్మికులకు పని గంటలు, వేతన ఒప్పందం, రక్షణ, ఇన్సూరెన్స్, పిఎఫ్ గ్రాడ్యుయేట్, ప్రమాద భీమా పథకం, పెన్షన్ స్కీం ఇలా అనేక కార్మిక చట్టాలను సాధించుకున్న చరిత్ర ఏఐటియుసిదని అన్నారు. సుదీర్ఘ పోరాటాలు చరిత్రలు కలిగిన ఏఐటీయూసీలో ఉండడం గర్వ కారణం అన్నారు.

ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రద్దుచేసి నాలుగు చట్టాలను చేయాలని చూస్తుందని దీనిని కార్మికులు ఐక్యంగా వ్యతిరేకించాలని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా 2025 డిసెంబర్ 26న ఖమ్మంలో జరుగు భారీ బహిరంగ సభను జయప్రదం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో జోగా నాగేంద్రబాబు, తేజావత్ మధు, ఈసం నరేష్, జాటోత్ భోజ్య, గుగులోత్ సోనీ, చింత దేవమ్మ, అరుణ భారతి, మంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.