15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సీఎం రేవంత్‌రెడ్డితో అఖిలేష్ భేటీ

13-12-2025 01:12 AM

తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీ హిల్స్‌లోని నివాసంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ యాదవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

రాష్ట్రంలో యాదవ్‌లకు ఎంతో ఇష్టమైన సదర్‌ను రాష్ట్ర ప్రభు త్వ పండుగా గుర్తిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని అఖిలేష్ యాదవ్ ప్రశంసించారు. దేశంలోని యాదవ సమా జం రేవంత్‌రెడ్డిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పేర్కొన్నారు. యాదవుల హృద యంలో రేవంత్‌రెడ్డి ఉండిపోతారని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని యాదవవర్గానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఇస్తున్నందున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.