17 April, 2026 | 2:36 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధమే

10-10-2025 01:38 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎం.నగేష్ ముదిరాజ్

ముషీరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముం దు ఇచ్చిన హామీలన్ని అబద్ధపు హామీలేనని తేలిపోయిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎం.నగేష్ ముదిరాజ్ అన్నారు. పెంచిన బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ అధిష్టానం గురువారం నిర్వహించ తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమానికి బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ హాజ రవుతారన్న ముందస్తు సమాచా రం తెలుసుకున్న పోలీసులు రామ్‌నగర్‌లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం లోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామనీ చెప్పే కాంగ్రెస్ పెంచిన బస్సు చార్జీల పేరుతో ఉన్న ఒక్క పథకాన్ని నీరుగార్చారన్నారు. ఆర్టీసీకి 6000 కోట్ల అప్పు ఉందని, దమ్ముంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ వద్ద నుంచి నిధులు తీసుకురావాలన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీలో ఉన్న కార్మికులకు కెసిఆర్ సీఎం ఉన్న సమయంలో 44% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత బిఆర్‌ఎస్ దేనని అన్నారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు, అబద్దాల గ్యారేంటి లని, ఆర్టీసీ చార్జీ పెంపుదల ఒక చేయితో ఇచ్చి మరో చేయితో అడుక్కున్నట్టుందన్నారు. ఇంట్లో మహిళలకు ఛార్జీలు లేకుండా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెబుతూ అదే ఇంట్లో ఉన్న మగవారందరికీ రెండింతల చార్జీలు పెంచడం దారుణమన్నారు. వెంటనే బస్ చార్జీలను తగ్గించాలని నాగేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.