24 April, 2026 | 4:46 PM

Breaking News

గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు అంగన్వాడిల ద్వారా సేవలు అందించాలి   •   మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ ఆడారపు హరికృష్ణ   •   దళితుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించండి   •   పేదల పెన్నిధి - సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి   •   ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎంపీడీవో   •   పాసయ్యమన్న ఆనందం బడికి దూరం అవుతున్నామన్న బాధ   •   సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే   •   శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్యే   •   రీస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడికి అభినందనలు   •   ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్‌ షాక్.. బీజేపీలోకి రాజ్యసభ సభ్యులు   •  

ఈశ్వరుడి గణాలన్నీ కొలువైంది ఈ పుణ్యభూమిలోనే..

23-09-2025 12:19 AM

రిషబ్ శెట్టి కథానాయకుడిగా హోంబాలే ఫిల్మ్స్ రూపొందించిన ‘కాంతార’ చిత్రం 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోంది ‘కాంతార: చాప్టర్1’. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను స్టార్ హీరో ప్రభాస్ సోమవారం విడుదల చేశారు. ‘నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు?’ అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.

‘ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో.. ధర్మాన్ని కాపాడ్డానికి ఆ ఈశ్వరుడు తన గణాలను పంపుతూనే ఉంటాడు. ఈ అన్ని గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలో’ అనే డైలాగ్ కాంతారా కథాంశాన్ని తెలియజేసింది. రిషబ్‌శెట్టి తనదైన నటనతో అదరగొట్టారు. యాక్షన్ సన్నివేశాల్లో మరోస్థాయిలో కనిపించారాయన. యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ అందంగా కనిపించింది. ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.