05-07-2025 12:07:49 AM
ఆప్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ముషీరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): సమున్నత ఆదర్శాలతో పట్టాలెక్కిన విద్యా హక్కు చట్టం ప్రతి బిడ్డకు విద్యను ప్రాథమిక హక్కుగా మార్చిందని, ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి ఏం.వి ఫౌండేషన్ కార్యదర్శి ఆర్. వెంకట్ రెడ్డి డిమాండ్ చేసారు.
ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ- ’ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య‘ పై ఆప్ రాష్ట్ర నాయకులు బుర్ర రాము గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యపై 10 నుండి 15 శతం బడ్జెట్ కేటాయిస్తే, విద్యార్థులకు నాణ్యమైన విద్య సాధ్యం అన్నారు.
టీచర్స్ ఫోరమ్ ఫర్ చైల్ రైట్స్ అధ్యక్షులు జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు బాల కార్మిక వ్యవస్థ నిర్ములించి, పిల్లలకు నాణ్యమైన విద్యను అందిచాలన్నారు. తల్లితండ్రుల సంఘం అధ్యక్షురాలు జి. భాగ్యమ్మ మాట్లాడుతూ ఇప్పటికి మురికి వాడల్లో నివశించే పిల్లలు చదువుకు దూరంగా నెట్టివేయబడ్డాని అన్నారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్ మాట్లాడుతూ విద్య సమస్యలపై పోరాటాలు తీవ్రతరం చేయాలన్నారు.
ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్య సంస్థల దోపిడీని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, వారి పై క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. వివిధ సంస్థల ప్రతినిధులు డి. ప్రకాష్, డాక్టర్ ఎ. శ్రీనివాస్, కె. వెంకట్ సాయినాధ్, ఆంజనేయులు, ఆప్ నేతలు డాక్టర్ సోలొమన్ రాజ్, సుధారాణి, నర్సింగ్ యమునా గౌడ్, డా.లక్ష్య నాయుడు, జావీద్ షరీఫ్, జిల్లోజు హేమ, దర్శనం రమేష్, సోహైల్, షాబాజ్, అజీజ్ బేగ్, రాకేష్ రెడ్డి, రాకేష్ సింగ్ పాల్గొన్నారు.