06-12-2025 07:11:20 PM
ముకరంపుర,(విజయక్రాంతి): శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఈనెల 14వన అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో 3 నుండి 10 తరగతి సీబీఎస్ఈ-స్టేట్-ఐసిఎస్ఇ విద్యార్థులకు "అమాట్" పరీక్షను నిర్వహించడం జరుగుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. శనివారం నగరంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో "అమాట్-2025" గోడ ప్రతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 14న ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామని, మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.5000, రూ.3000, రూ.2000 నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలను ప్రదానం చేస్తామని తెలిపారు. విజేతలందరికీ ఈనెల 22న రామానుజన్ జయంతోత్సవాల్లో అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆసక్తి గలవారు ఈనెల 12లోగా పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 92469 34441, 92469 34456, 9398230614 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.