11 March, 2026 | 3:14 PM

Breaking News

గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం   •   ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •  

దేశీయ ‘జోహో’కు మారిన అమిత్‌షా

09-10-2025 12:44 AM
  1. ఇక నుంచి ఇదే నా ఈనూ చిరునామా

ఎక్స్‌లో పోస్టు చేసిన అమిత్‌షా

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు.. స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, డిజిటల్ ఇండియాలో భాగంగా ‘జోహో ప్లాట్‌ఫామ్ వైపు కేంద్ర మంత్రులు మొగ్గుచూపుతున్నారు. అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఆ సంస్థ సేవలు వినియోగిస్తుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోహో మెయిల్‌లోకి మారిపోయారు.

ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా బుధవారం వెల్లడించారు. “హలో.. నేను జోహో మెయిల్‌కు మారాను. నా ఈనూమెయిల్ చిరునామాలో ఈ మార్పును గమనించండి. amithshah.bjp@zohomail.in నా కొత్త మెయిల్ అడ్రస్‌” అని అమిత్ షా తన పోస్టులో రాసుకొచ్చారు. ఇక నుంచి మెయిల్స్ అన్నీ ఈ కొత్త అడ్రస్‌కే పంపాలని చెప్పారు.

భారత్‌ఫై అమెరికా సుంకాల మోత, జీఎస్టీ సంస్కరణల వేళ ప్రధాని మోదీ ‘స్వదేశీ’ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో -స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని పిలుపు మేరకు మంత్రులు జోహో సేవలను వినియోగిస్తున్నారు. కాగా జీమెయిల్, మైక్రోసాఫ్ట్‌లకు పోటీగా స్వదేశీ జోహో మెయిల్‌ను తీసుకువచ్చారు.