calender_icon.png 18 October, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగుళాంబ సన్నిధిలో కేంద్ర పురాతత్వ శాఖ అధికారి

17-10-2025 12:32:07 AM

అలంపూర్ అక్టోబర్ 16:అలంపూర్ ఆలయాలను కేంద్ర పురాతత్వ శాఖ సూపరింటెండెంట్ అధికారి నిఖిల్ దాస్ గురువారం దర్శించుకున్నారు.ముందుగా వీరు ఉభయ ఆలయాలను దర్శించుకుని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ఈవో దీప్తి ఆలయము నందు చేపట్టవలసిన ప లు అభివృద్ధి పనులు ,మరమ్మత్తుల గురించి చర్చించి అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

వీలైనంత త్వరగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర పురాతత్వ శాఖ సూపరింటెండెంట్ తెలిపినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ కేంద్ర పురాతత్వ శాఖ కన్సర్వేషన్ అసిస్టెంట్ వెంకటయ్య, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.