17 April, 2026 | 2:37 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

వైభవంగా షిరిడి సాయి వార్షికోత్సవ పూజ

15-04-2025 12:42 AM

 కొత్తగూడెం, ఏప్రిల్ 14  (విజయ క్రాంతి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శ్రీ పాండురంగ భజన మందిరంలో కొలువుదీరిన  శ్రీ షిరిడి సాయి బాబా, శ్రీ కుసుమహల్ బాబా ల మొదటి వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట గావించి  నేటికీ  ఒక సంవత్సరము పూర్తయిన సందర్భంగా  శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ కుసుమనాధ బాబా వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత,వైభవ్వేదంగా జరిగాయి.

ఉదయం 6 గంటల నుండి 108 కలశాలు స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అనంతరం 108 కలశాల నీటి, పంచామృతాలతో స్వామివారికి, అభిషేకాలు చేసారు. అనంతరం అర్చకులు శ్రీరంగం వెంకటరమణాచార్యులు, శ్రీరంగం రంగాచార్యులు, పండిత్ దినేష్ కుమార్ శర్మ, వేదుల శ్రీరామచంద్రమూర్తి, కంచర్ల మధుకుమారాచార్యులు స్వామివారికి ప్రత్యేకమైన హోమా కార్యక్రమం నిర్వహించి,భక్తుల ను దీవించారు. అనంతరం అన్న సమారాధన క నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రు లయ్యారు.