18 April, 2026 | 3:57 PM

Breaking News

మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •  

వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు – హనుమకొండలో ర్యాలీ

07-11-2025 05:09 PM

హనుమకొండ,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వందేమాతరం 150 ఏళ్ల జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీ నక్కలగుట్ట కాలోజి జంక్షన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలుతో సాగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద గుజ్జుల అరుణ బృందం చే పూర్తి వందేమాతర గీతాన్ని  సామూహికంగా ఆలపించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ వందేమాతర 150 వ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి భారతీయుడు వందేమాతరం గొప్పతనాన్ని తెలుసుకోవాలన్నారు. వందేమాతర ఉద్యమం తోనే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు. మాజీ మేయర్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ మైనారిటీల ప్రసన్నత కోసం వందేమాతరం లోని దేవి దుర్గమ్మ, భారత్ మాత అంశాలు ఉన్న చరణాలను తొలగించిందని విమర్శించారు.150 సంవత్సరాల వేడుకలు జరుపుకునే సందర్భంలో ప్రతి భారతీయుడు వందేమాతరం యొక్క అసలు అర్థం తెలుసుకుని గర్వపడాల్సిన సమయం వచ్చింది అని పేర్కొన్నారు.