07-11-2025 06:55:39 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపల్ ఆవరణలో శుక్రవారం వందేమాతరం గీతాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వందేమాతరం గీతాలపన కార్యక్రమం గురించి కమిషనర్ రమేష్ మాట్లాడుతూ... ఇది భారతీయులందరినీ ఐక్యమత్యం చేయడానికి రచించిన గేయంప్రజలకు ఈ గేయం స్వాతంత్ర ఆకాంక్షను రగిలించిందని అభివర్ణించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల అనుసారం ఈరోజు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ ఆవరణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్, అధికారులు, ఏఎన్ఎమ్స్, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.