11 March, 2026 | 3:13 PM

Breaking News

ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •  

బంగ్లాదేశ్‌లో మరో ఘాతుకం

07-01-2026 12:00 AM
  1. హిందూ వ్యాపారిని హతమార్చిన దుండగులు
  2. నర్సింగిడి జిల్లాలో దారుణం మూడువారాల్లో ఆరుగురు హిందువుల హత్య

ఢాకా, జనవరి ౬: బంగ్లాదేశ్ హిందూ మైనారిటీలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థి నేత హాదీ మరణం తర్వాత ఈ దాడులు మరింత పెరిగాయి. దండుగులు తాజాగా మరో హిందువును పొట్టనపెట్టుకున్నారు. గడిచిన ౧౮ రోజుల్లోనే అలా దుండగులు ఆరుగురు హిందువులను హతమార్చారు. తాజా హత్య రాత్రి నర్సింగిడి జిల్లాలో చోటుచేసుకున్నది. చార్సిందూర్‌కు ఎందిన మణిచక్రవర్తి (40) స్థానికంగా కిరాణా దుకాణం నడుపుతున్నాడు.

సోమవారం రాత్రి దుకాణంలో మణిచక్రవర్తి ఉండగా, గుర్తుతెలియని దుండగులు అక్కడికి వచ్చి దాడి చేసి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇటీవల మణిచక్రవర్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతోనే దుండగులు హతమార్చి ఉంటారని స్థానికులు చెప్తున్నారు. మూడువారాల్లో ఇప్పటివరకు దీపూ చంద్రదాస్, అమృత్ సామ్రాట్ మండల్, బజేంద్ర బిశ్వాస్, ఖోకన్ చంద్రదాస్, రాణాప్రతాప్ అనే హిందువులు దుండగుల చేతుల్లో హతమవగా, తాజాగా మణిచక్రవర్తి హత్యకు గురయ్యాడు.