7 April, 2026 | 1:21 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

ప్రాణాలు కోల్పోయిన మరో హిందువు

03-01-2026 02:28 PM

ఢాకా: బంగ్లాదేశ్‌లో(Bangladesh) మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల చంద్రదాస్ అనే హిందువుపై కొందరు దుండగులు దాడి చేశారు. దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో చంద్రదాస్ చెరువులో దూకాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రదాస్ శనివారం మృతి చెందాడు. ఉస్మాన్ హాదీ హత్య అనంతరం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు పెరిగాయి. దాడుల్లో ఇప్పటికే దీపూదాస్, సామ్రాట్, బిశ్వాస్ మృతి చెందారు. వరస ఘటనలతో బంగ్లాదేశ్ లో హిందువుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. 

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై కొనసాగుతున్న దాడులపై భారత్ అనేకసార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తన పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక ప్రకటనలో, బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీలను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హయాంలో హిందువులు సహా మైనారిటీలపై హింస పెరుగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో, మానవ హక్కుల సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. యూనస్‌తో కలిసి పనిచేస్తున్న అధికారులు తాము మైనారిటీలను రక్షిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయి నివేదికలు దీనికి విరుద్ధంగా చెబుతున్నాయి.