8 April, 2026 | 10:24 AM

ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్తగా అపర్ణ నియామకం

11-10-2025 12:07 AM

డిచ్‌పల్లి అక్టోబర్ 10 (విజయ క్రాంతి) : తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం సమన్వయకర్తగా ప్రొఫెసర్ కే అపర్ణని వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ పి యాదగిరి ఆదేశాల మేరకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ అపర్ణ విశ్వవిద్యాలయంలో అనేక పరిపాలన విభాగం పదవులను వంతంగా చేపట్టారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఎన్‌ఎస్‌ఎస్ కార్య క్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ప్రొఫెసర్ అపర్ణ తెలిపారు.

తెలం గాణ విశ్వవిద్యాలయంలోని అన్ని యూ నిట్ల సిబ్బంది నీ అధికారుల సమన్వయంతో విధులు విజయవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఆమె  తెలిపారు తను నియమించినందుకు ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.