13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

08-01-2026 12:00 AM

ప్రిన్సిపాల్ అరుణ 

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), జనవరి 7: 2026 - 27 విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో 5 నుండి 9వ తరగతి వరకు ప్రవేశాల కొరకు ఈనెల 21 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జాజిరెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఎం అరుణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇట్టి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య,భోజనం, వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించబడతాయని అన్నారు.