6 July, 2026 | 9:08 PM

Breaking News

ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •   అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ   •  

అక్రమ కట్టడాలపై టీపీఓతో వాగ్వాదం

17-09-2025 12:35 AM

మేడ్చల్, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో అక్రమ  నిర్మాణాలు జోరుగా సాగుతున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి తో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముల్లంగిరి శ్రీహరి చారి, బిజెపి నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. మంగళవారం టి పి ఓ ను కలిసి గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

తమ ఫిర్యాదులపై నెలల తరబడి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద వాణిజ్య సంస్థలు, భవనాలు మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మిస్తున్నారన్నారు. పిస్తా హౌస్, ఐటిఐ ఎదురుగా సంతోష్ ధాబా, లైవ్ కిచెన్‌లకు అనుమతి లేదన్నారు.

కేఎల్‌ఆర్ కాలనీలో కమాన్ దగ్గర రెండంతస్తులకు అనుమతి తీసుకొని అదనంగా మరికొన్ని అంతస్తులు నిర్మిస్తున్నారన్నారు. కేఎల్‌ఆర్ లో ఒక్క భవనాన్ని కూడా అనుమతులకు అనుగుణంగా నిర్మించడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు.