16 April, 2026 | 10:57 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ విజయవంతం చేయాలి

09-05-2025 10:19 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి):  ఈనెల 12 న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి, కార్యదర్శి సూరంపల్లి మహేందర్ లు అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1974 ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడిందని అన్నారు. 50 ఏళ్ల చరిత్రను, కృషిని, సృజించుకునే పనితో పాటు అరుణోదయం సావనీర్, అరుణోదయ డాక్యుమెంటరీ, విప్లవ ప్రజా సంస్థల 50 ఏళ్ల ప్రస్థానపు పాటను ప్రదర్శించుకుంటూ జరిగే అరుణోదయ 50 ఏళ్ళ పరిపూర్తి  ముగింపు సభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎల్లం, మల్లేశం,కీసర ఎల్లం, పిట్ల మల్లేశం, ఎమ్మార్పీఎస్ నాయకులు సాయిలు తదితరులు పాల్గొన్నారు.