calender_icon.png 25 August, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి: ఎమ్మెల్యే ధన్‌పాల్

25-08-2025 12:00:00 AM

నిజామాబాద్ ఆగస్ట్ 24: (విజయ క్రాంతి) ః ఆర్య వైశ్యులు అంటేనే సమాజంలో సేవకు మారు పేరుగా  అన్నదాన కార్యక్రమాల నుండి విద్య, వైద్యం, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో సేవలందించడంలో ముందుంటారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సంపద సృష్టించడంలోకూడా ముందుంటూ 80% పన్నులను ప్రభుత్వలకు చెల్లెస్తున్నారని, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల్లో కూడా మన సేవ ఉన్నందుకు గర్వాంగా ఉందన్నారు.

నగరంలోని మహాలక్ష్మి నగర్ వాసవి హై స్కూల్ బెల్దే భవన్ లో నిర్వహించిన వాసవి యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి  ముఖ్యఅతిథులు గా  ధన్ పాల్ సూర్యనారాయణ  హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు అన్ని రంగాలలో ముందున్న మనం ఒక రాజకీయ రంగంలో వెనుకపడిపోతున్నాం. అని రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు  ఎదగాలన్నారు ప్రభుత్వ ఏర్పాటులో మనం కీలక పాత్ర పోషించాలని అన్నారు.

ప్రధానమంత్రిగా మోడీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణంలో ఉన్న పేదల గురించి ఆలోచించి ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ 10% కల్పించిన ఘనత మోదీ కి బిజెపి పార్టీకి దక్కుతుందన్నారు. యువజన సంఘం  ఏకగ్రీవంగా ఎన్నికైన వారందరిని అభినందిస్తూ ఈ  గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందనే విషయం నూతన అధ్యక్షా  కార్యవర్గం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా నూతనంగా ఎన్నికైన యువజన సంఘంలో అధ్యక్షుడిగా తోడుపునూరి అంజయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శి కొండ నర్సింగ్ రావు గుప్తా, కోశాధికారి పసుపునూరి రఘునాథ్ గుప్తా, మరియు సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.