8 July, 2026 | 8:39 PM

Breaking News

ఘనంగా అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు   •   పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •  

సుప్రీంకోర్టు సీజేఐపై దాడి గర్హనీయం

08-10-2025 12:02 AM
  1. నిందితుడిని కఠినంగా శిక్షించాలి

తుర్కయంజాల్ అఖిలపక్ష నేతల డిమాండ్

తుర్కయంజాల్, అక్టోబర్ 7: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడిని అఖిలపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తాలో సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు సీజేఐపై జరిగిన దాడి యావత్ భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు.

దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై దాడి జరగడం హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మంపేరుతో దాడులకు పాల్పడటం ఘోరమన్నారు. సీజేఐ దళితుడు కాబట్టే ఆయనపై దాడి చేశారని మండిపడ్డారు.నిందితుడు రాకేష్ కిష్పో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు ఓరుగంటి యాదయ్య, సీపీఎం జిల్లా నాయకుడు డి.కిషన్, బీజేపీ నేత బచ్చిగళ్ల రమేష్, బీఎస్పీ నేతలు వద్దిగళ్ల బాబు, పట్నం రమేష్, మేతరి కుమార్, సీపీఎం నాయకులు ఆశీర్వాదం, సత్యనారాయణ, జ్యోతిబసు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొమ్మని దర్శన్, గోపాల్, వినోద్, సాయి, భగత్ తదితరులు పాల్గొన్నారు.