8 June, 2026 | 7:57 PM

Breaking News

మహర్రం సందర్భంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి   •   పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •  

నూతన సర్పంచ్‌ను సన్మానించిన ఆటో యూనియన్ నాయకులు

31-12-2025 07:30 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం అర్వపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిల్లంచర్ల విద్యాసాగర్ ను గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు.దీంతో కాసర్లపహాడ్ గ్రామ హనుమాన్ ఆటో యూనియన్ నాయకులు బుధవారం అర్వపల్లిలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ విద్యాసాగర్ ను శాలువాలు, బొకేలతో సత్కరించి, సన్మానించారు. ఆటో యూనియన్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బొల్లం వీరమల్లు, దండుగుల వెంకన్న, సిరికొండ సత్యనారాయణ, ఎల్లయ్య, యాదగిరి, అంజయ్య, సైదులు, సంజీవ, సాయి, నరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.