17 June, 2026 | 12:20 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

ఆర్‌టీఐపై అవగాహన కల్పించాలి

11-10-2025 01:08 AM

ఆదిలాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాం తి): సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ప్రభుత్వ అధికారుల పని తీరులో పారదర్శకత,  జవాబుదారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక మైలురాయిగా చట్టం ఉందని, ప్రభుత్వం నుండి సమాచారం పొందే హక్కు గురించి పౌరులలో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 నుండి 12 వరకు ఆర్‌టీఐ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలా దేవి అన్నారు. 

అక్టోబర్ 5 నుండి 12 వరకు  గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో సందర్భంగా శుక్రవారం అదనపు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసి న జిల్లా స్థాయి  సమావేశంలో ఆమె పాల్గొ ని పలు  సూచనలు చేశారు.

ఈ సందర్భం గా అదనపు కలెక్టర్ శ్యామలా దేవి మాట్లాడుతూ ఆర్‌టీఐ చట్టంపై ప్రతీ ఒక్క రూ అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టంను సమర్ధవంతంగా నిర్వహించాలాన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు వారి క్రింది స్థాయి సిబ్బంది కి చట్టం మీద అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో  కలెక్టరేట్ ఏవో వర్ణ, పలువురు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.