15 April, 2026 | 7:34 AM

బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన పెంచాలి

27-11-2025 05:07 PM

నిర్మల్ రూరల్: బాలల సంరక్షణ చట్టాలపై ప్రతి పాఠశాలలో పిల్లలకు అవగాహన పెంచాలని బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఎండి వహీద్ అన్నారు. గురువారం అనంతపెట్ కేజీబీవీ పాఠశాలలో ముక్తుభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్యవివాల నిషేధ చట్టం బాలల సంరక్షణ తదితర చట్టాలపై అవగాహన కల్పించి బాలల సంరక్షణ కోసం కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల అధికారి మురళి నిర్వాకులు అనిల్ శరత్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.