15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ర్యాలీలపై నిషేధం.. అభ్యర్థులు గమనించాలి..

12-12-2025 12:11 AM

ఎస్పీ డి.జానకి

మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 11: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాల నేపథ్యంలో, విజయాలు సాధించిన అభ్యర్థులు వారి అనుచరులు ఎలాంటి ర్యాలీలు, బైక్ ర్యాలీలు, బానసంచలు, డీజేలు, పెద్ద ఎత్తున గుమిగూడడం వంటి కార్యక్రమాలు ఏవీ నిర్వహించకూడదని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఈ రకమైన కార్యక్రమాలు పూర్తిగా నిషేధించబడ్డాయని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉద్రిక్తతలు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి అభ్యర్థి, అనుచరులు నియ మాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

ఎవరు ఈ నిబంధనలు ఉల్లంఘించినా, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసుల పర్యవేక్షణను మరింత బలపరచినట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.