20-09-2025 05:29:40 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతికి, సంప్రదయానికి చిన్నంగా భావించే బతుకమ్మను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మకు రంగురంగుల పువ్వులను సేకరించి బతుకమ్మల తయారు చేసి పాఠశాల ఆవరణలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో అలరించారు.