16 April, 2026 | 9:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

24న బీసీల మహాధర్నాను విజయవంతం చేయాలి

20-10-2025 01:55 AM

బీసీ రిజర్వేషన్ల సాధన సమితి కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్

ముషీరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ‘ఛలో హైదరాబాద్‘  మహాధర్నా కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపునిచ్చింది.

ఆదివారం చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు, సాధన సమితి కన్వీనర్ బాలగోని బాలరాజ్ గౌడ్, డాక్టర్ విశారదన్ మహారాజ్, అయిలి వెంకన్న గౌడ్, యెలికట్టే విజయ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్లు మాట్లాడుతూ  42 శాతం రిజర్వేషన్ల పట్ల బిజేపీ కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశా రు. శీతాకాలం పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించడంతోపాటు 9వ షెడ్యూల్డ్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. మహాధర్నాలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉగ్యోగులు, విద్యార్థులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.