16 April, 2026 | 7:24 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

రాజన్న ఆలయంలో శృంగేరి పీఠాధిపతి

20-10-2025 01:55 AM
  1. శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు 
  2. స్వాగతం పలికిన మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ధర్మ విజయ యాత్రలో భాగంగా  శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ఆదివారం వేములవాడను సందర్శించారు. ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆచారం ప్రకారం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాజన్నకు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహా స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటిలింగాల దర్శనం చేసుకున్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి మ్యాప్లు పరిశీలించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ ఎం హరిత, ఎస్పీ మహేష్ బి గితే, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,ఆ లయ ఈవో రమాదేవి, వేముల వాడ ఆర్డీవో రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్,  తహసీల్దార్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.