01-08-2025 12:00:00 AM
ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కడప పెట్టుకుంటున్న శుభ సందర్భంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చిత్రపటంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల: జులై 31 (విజయక్రాంతి): వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కొనరావు పేట మండలం పల్లిమక్త గ్రామానికీ చెందిన నా యిని నరహరి- లావణ్య దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో తమకు ఇ ల్లు మంజూరి అయ్యిందని, చాలా సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత స్వంత ఇంటి కల నెరవేరడం పట్ల సంతొషం వ్యక్తం చేశారు.
ఇల్లు నిర్మా ణ దశలో ఉండి ప్రస్తుతం ఇళ్లు కడప పెట్టు కున్న సందర్భంగా పూజా కార్యక్రమాల్లో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చిత్రపటంతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.ప్రజా ప్రభుత్వంలో తమకు అన్ని రకాల పథకాలు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.