14 April, 2026 | 5:21 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

సాహితీవేత్త ఇమ్మడి రాంబాబు కు ఉత్తమ ప్రశంసా పత్రం

16-05-2025 06:10 PM

తొర్రూరు: తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ, భవాని సాహిత్య వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన పహల్గాం కవితల సంకలనం పుస్తకావిష్కరణ హైదరాబాదులోని రవీంద్రభారతిలో శుక్రవారం జరిగింది. ఇందులో ఎంపిక చేసిన కవితల్లో తొర్రూరు డివిజన్ చెందిన సాహితీ వేత్త ఇమ్మడి రాంబాబు రచించిన ఐక్యతను చాటుదాం ఉగ్రవాదని తుదముట్టిద్దాం ఉత్తమ కవితగా ప్రకటించారు.

నిర్వాహకులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ రావు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి నామోజీ వీరాచారి, బాల సాహితీవేత్త గద్వాల సోమన్న, వీత్రీ ఛానల్, విశ్వంభర పత్రిక సంపాదకులు డాక్టర్ కాచం సత్యనారాయణ  రచయితల మీదుగా సన్మానించి, ప్రశంస పత్రం అందజేశారు.