21-08-2025 12:26:11 AM
ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 20, (విజయ క్రాంతి); భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను హెల్త్ హెమెర్జెన్సీ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ వద్ద జరిగిన సమావేశంలో పేర్కొంటూ, జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలు మలేరియా,వైరల్ పివర్ లతో బాధపడుతున్నారని దాదాపు అన్ని ఏరియా వైద్యశాల, వివిధ పీహెచ్ సీ లో కలిపి దాదాపు 1000 మంది జ్వర పీడితులు ఉన్నప్పటికీ, అధికారులు 60 నుండి 100 మలేరియా కేసులు ఉన్నాయని చూపిస్తున్నారని ఆరోపించారు.
సరియైన చికిత్స సదుపాయాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , సిబ్బంది చేయడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో వెంటనే దోమ తెరలు, మలేరియా నిరోధక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసి ఐకాస నాయకులు చీమల ప్రమీల, వజ్జ శ్రీను, పడిగా ప్రశాంత్, వాసం అంజి బాబు, చుంచు బాలరాజు, బత్తుల విజయ తదితరులుపాల్గొన్నారు.