15 May, 2026 | 8:18 PM

Breaking News

సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి   •   బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •  

ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

08-09-2025 01:41 PM

హైదరాబాద్: తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ప్రజాభవన్‌ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. వ్యవసాయం పారిశ్రామిక సేవా రంగాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని పేర్కొన్నారు. కర్ణాటక హర్యానాను అధిగమించి తెలంగాణ రికార్డులు సాధించిందని.. వార్షిక రుణ ప్రణాళికలలో మొదటి క్వార్టర్ లోనే 33.64 శాతం సాధించిందని తెలిపారు. 

33.64 శాతం సాధించడం అభినందనీయమని.. ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వండని.. ఆస్తుల తాకట్టు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండని రైతులని ఒత్తిడి చేయవద్దని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావిస్తుందని.. రైతుల పక్షాన రుణామాఫీ రైతు భరోసా పేరిట బ్యాంకులకు రుణాలు జమ చేశామని అన్నారు. రూ.30  కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని.. బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇది ఒక రికార్డు అని వెల్లడించారు.