20-08-2025 09:52:14 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ది దారులు భూమి పూజా చేసుకొని ముగ్గుపోయడం జరిగింది.లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ ఇంచార్జీ కెకె మహేందర్ రెడ్డి, నాయకులకు కృతజ్ఞతలు తెలియచేశారు. నాయకులు మాట్లాడుతూ... అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటివరకు గ్రామంలో 50 ఇళ్ల వరకు నిర్మాణం చేపట్టడం జరిగింది. మిగతా వాటిని కూడా త్వరలో మొదలు పెట్టేలా చూస్తామని తెలియచేశారు.