calender_icon.png 15 August, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

14-08-2025 11:20:31 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ఆదేశాల మేరకు గురువారం 58వ డివిజన్ పరిధి వడ్డేపల్లిలో ఏ.ఈ నరేందర్ రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తాళ్లపల్లి విజయ్ కుమార్, తాళ్లపల్లి రవీందర్, మండల సమ్మయ్య, తాళ్లపల్లి మేరీలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన ఇమ్మడి శోభ ఇంటి నిర్మాణ భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిచేకూర్చేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ శ్యాంసుందర్, కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి ప్రసన్నకుమార్, పాస్టర్ నల్ల రాజు, కాలనీవాసులు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.