16 April, 2026 | 8:13 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

అంబేద్కర్ విగ్రహాన్ని బిజెపి నాయకులు శుభ్రం

13-04-2025 09:56 PM

మునగాల: మండల కేంద్రములో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్  విగ్రహమును   అంబేద్కర్  జయంతి సందర్భంగా  భారతీయ జనతా పార్టీ నాయకులు శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య మాట్లాడుతూ... అంబేద్కర్  ఎందరికో ఆదర్శనీయమన్నారు. నీతికి నిజాయితీకి మారుపేరు అని చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో ముందుండే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  అన్నారు. అంబేద్కర్  పుట్టినరోజును భారత ప్రజలందరూ సమానత్వ దినోత్సవం గా జరుపుకుంటారు అని అన్నారు ఈ కార్యక్రమంలో మునగాల మండల అధ్యక్షుడు శ్రీ భద్రంరాజు కృష్ణ ప్రసాద్ బిజెపి సీనియర్ నాయకులు యాద రమేష్ బిజెపి సూర్యాపేట జిల్లా ఆర్టిఐ సెల్ కన్వీనర్ కొండ్లే రవికుమార్ మైలారిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.