12 March, 2026 | 10:13 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

జిల్లా కుంగ్-ఫూ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

13-04-2025 09:59 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంగ్ -పూ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ సమావేశం కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి 50 మంది కుంగ్-పూమాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్లు జిల్లాలో కుంగ్-పూ మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై పలు అంశాలను చర్చించారు. జిల్లాలో ప్రతిభవంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు  తీర్మానించారు. త్వరలో వాటిని జిల్లాలో అమలు చేయనున్నట్లు  పేర్కొన్నారు. అనంతరం కుంగ్-పూ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అసోసియేషన్ కు నూతన కమిటీని  మాస్టర్స్ ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీ అధ్యక్షులు:ఐ.ఆదినారాయణ, కార్యనిర్వహక అధ్యక్షులు గా ఎన్.వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శిగా పి.కాశీ హుస్సేన్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులంతా కుంగ్-పూ మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధి కొరకు, తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర సీనియర్ మాస్టర్ ఐ.ఆదినారాయణ పర్యవేక్షణలో,జరిగిన ఈ కార్యక్రమంలో కోచ్ లు పలువురు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.