16 April, 2026 | 10:08 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

జిల్లా కుంగ్-ఫూ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

13-04-2025 09:59 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంగ్ -పూ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ సమావేశం కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి 50 మంది కుంగ్-పూమాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్లు జిల్లాలో కుంగ్-పూ మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై పలు అంశాలను చర్చించారు. జిల్లాలో ప్రతిభవంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు  తీర్మానించారు. త్వరలో వాటిని జిల్లాలో అమలు చేయనున్నట్లు  పేర్కొన్నారు. అనంతరం కుంగ్-పూ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అసోసియేషన్ కు నూతన కమిటీని  మాస్టర్స్ ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీ అధ్యక్షులు:ఐ.ఆదినారాయణ, కార్యనిర్వహక అధ్యక్షులు గా ఎన్.వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శిగా పి.కాశీ హుస్సేన్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులంతా కుంగ్-పూ మార్షల్ ఆర్ట్స్ అభివృద్ధి కొరకు, తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర సీనియర్ మాస్టర్ ఐ.ఆదినారాయణ పర్యవేక్షణలో,జరిగిన ఈ కార్యక్రమంలో కోచ్ లు పలువురు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.