21 July, 2026 | 7:45 PM

Breaking News

రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •   జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •  

42 శాతం బీసీ రిజర్వేషన్లపై బీజేపీ స్పష్టతనివ్వాలి

15-07-2025 10:33 PM

మహబూబాబాద్,(విజయ క్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై బిజెపి స్పష్టత నివ్వాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి పార్లమెంటులో బిల్లు ఆమోదింప చేయాలని బీసీ హక్కుల సాధన సమితి మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుగు కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపి కలెక్టర్ కార్యాలయంలోని ఏవోకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అంశంపై తలా ఒక మాట మాట్లాడుతూ బీసీల్లో అయోమయం కలిగిస్తున్నారని, 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అమలు చేసే విధంగా కృషి చేయాలని, లేనిపక్షంలో బీజేపీ ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీల సంఖ్యకు తగ్గట్టుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు.