calender_icon.png 8 September, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పర్యటనను విజయవంతం చేయాలి

01-09-2025 01:02:57 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

కరీంనగర్ క్రైం, ఆగస్టు 31 (విజయ క్రాంతి): బిజెపి రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మొదటిసారిగా ఈనెల 3న కరీంనగర్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న రామచందర్ రావుకు ఘన స్వాగతం పలకాలని, అనంతరం పట్టణంలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్ లో జరిగే పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బిజెపి ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు జిల్లా పర్యటన విజయవంతం చేసేందుకు బిజెపి శ్రేణులు తగిన కృషి చేయాలని, బిజెపి పోలింగ్ బూత్ శ్రేణులు బూత్ సమ్మేళన సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కా ర్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్, కోమల ఆంజనేయులు, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకట్ రెడ్డి, గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, ఎండి ముజీబ్, దురిశెట్టి సంపత్ , దూబాల శ్రీనివాస్, దండు కొమురయ్య, పుప్పాల రఘు, గుజ్జ శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.

- ప్రధాని మోదీ మన్ కి బాత్ వీక్షించిన బిజెపి నేతలు.

కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ నేతలతో కలిసి ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలుఉన్నారు.