17-09-2025 06:50:55 PM
నల్గొండ టౌన్, (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగం రక్తదానం చేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ సందర్భంగా వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ భారతదేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని సబ్కా సాథ్ – సబ్కా వికాస్ అనే నినాదంతో దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు అవకాశాలు, కృషి చేసి ప్రతి రంగంలో అపూర్వమైన మార్పులు తీసుకొచ్చారని తెలిపారు.