27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

సిరి సంపదలు కలగాలి: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

17-09-2025 08:27 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి):  విశ్వకర్మ  భగవానుడి ఆశీస్సులతో  ప్రజలందరికీ  ఆనందం, అభివృద్ధి, సుఖసంతోషాలు,  సిరిసంపదలు కలగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరంలోని మోనప్పగుట్టలో గల మౌనేశ్వర స్వామి దేవాలయం లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి,  అనంతరం యాగశాలలో జరిగిన యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అందరికీ విశ్వకర్మ భగవానుడి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.  మౌనేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో అసంపూర్తిగా ఉన్న మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాలు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామి ఇచ్చారు.  విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించారు.