13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

రక్తదానం ప్రాణాలను కాపాడుతుంది

13-01-2026 01:26 AM

వివేకానంద జయంతి వేడుకల్లో ఎంపీ నగేష్

ఉట్నూర్, జనవరి ౧౨ (విజయక్రాంతి): రక్తదానం చేయడంతో ప్రాణాపాయ స్థితిలో  ఉన్నవారిని రక్షించుకోవచ్చునని, అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. సోమవారం ఉట్నూరు మండలం హస్నాపూర్‌లో  స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని గ్రామ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తో కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచ్ వర్షా తాయి, గ్రామ పెద్దలు స్వామి, వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు.