14 July, 2026 | 3:08 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

చేతుల్ని కలిపితే బలపడిపోవా బంధాలు..

12-05-2025 01:54 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి తాజాగా థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 

‘డమ్ డమారే’ అనే ఈ పాట.. సినిమాలో ముగ్గురు హీరోల మధ్య ఉన్న స్నేహాన్ని ఆవిష్కరిస్తోంది. ‘భోగి మంటల్లో తోసేద్దామా బాధలు.. కష్టాలు కన్నీళ్లు మోస్తూ ఇంకా ఎన్నాళ్లూ.. చుక్కలు కలిపితే ముంగిట్లోన ముగ్గులు.. చేతుల్ని కలిపితే బలపడిపోవా బంధాలు.. అరెరే.. ఇట్టాగ చెలిమి కొరకు.. ఎవరూ అనలేదిదివరకూ.. అరెరే.. ఎంత అన్నదమ్ములైనా మనలాగ ఉంటారా జల్లెడేసి వెతుకు.. డమ్ డమారే..

దుమ్మురేగాలిలే.. డమ్ డమారే.. సంకురాత్రి పండగొచ్చె.. సంబరాలే సాగాలిలే..’ అంటూ సాగుతోందీ పాట. శ్రీచరణ్ పాకాల స్వరాలు, భాస్కరభట్ల గీత సాహిత్యం, రేవంత్, సాహితి చాగంటి గాత్రం వినసొంపుగా ఉన్నాయి. ఈ చిత్రానికి డీవోపీ: హరి కే వేదాంతం; సంగీతం: శ్రీచరణ్ పాకాల; మాటలు: సత్యర్షి, తూమ్ వెంకట్; సాహిత్యం: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, చైతన్యప్రసాద్, బాలాజీ, తిరుపతి; ఫైట్స్: రామకృష్ణ, నటరాజ్ మడిగొండ.