1 April, 2026 | 12:58 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

బార్డర్ చెక్‌పోస్ట్ ఏర్పాటు

09-10-2025 12:00 AM

అలంపూర్, అక్టోబర్ 8: గద్వాల జిల్లాలో తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం పోలీసులు బార్డర్ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్త్స్ర కిరణ్ కుమార్ తెలిపారు.

అందులో భాగంగాఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.చెక్ పోస్ట్ వద్ద మూడు షిఫ్టుల్లో 24 గంటలు పోలీసులు విధులు నిర్వహించునున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.ప్రతి షిఫ్ట్ కు ఒక ఎస్‌ఐ తో పాటు నలుగురు పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు .రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నగదు, మద్యం ఇతర వస్తువుల తరలింపు పై ప్రత్యేక నిఘాను ఉంచనున్నట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.