23 June, 2026 | 10:07 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

రాఘవపురంలో ఇరు పార్టీల ప్రచార జోరు

11-12-2025 06:01 PM

మోతె (విజయక్రాంతి): గురువారం మండల పరిధిలోని రాఘవపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన రెండు పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. సిపియం పార్టీ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్ది మంజుల భాస్కర్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారని మంజుల భాస్కర్ రెడ్డి చెప్పారు. గ్రామంలో నేటికీ పరిష్కారం కానీ పనులన్నింటిని పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.

గ్రామంలో సీసీ రోడ్లు వీధి దీపాలు పూర్వపు డొంక బాటలన్ని రోడ్లు వేయడం జరుగుతుందని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి మట్టి పల్లి నీలమ్మ రామల్లు మాట్లాడుతూ గ్రామంలో నన్ను ఆదరించి ఓట్లు వేసిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాన్ని చేయడమే నా లక్ష్యమన్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.